English | Telugu

రెహ‌మాన్ కుమారుడికి తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, జంట ఆస్కార్ల‌ను గెలుచుకున్న ఇసైపుయ‌ల్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కుమారుడు ఎ.ఆర్‌. అమీన్‌కి తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. ఈ విష‌యాన్ని ఎ.ఆర్‌. అమీన్ సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తావించారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, సైరాభానుకి ఇద్ద‌రు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు ఎ.ఆర్‌. అమీన్‌కి తండ్రిలాగానే సంగీత‌మంటే చాలా ఇష్టం. `ఓ కాద‌ల్ క‌న్మ‌ణి`, `స‌చిన్‌`, `2.0`వంటి చిత్రాల్లోనూ అమీన్ పాట‌లు పాడారు. అమీన్ సొంతంగానూ చాలా పాట‌ల‌కు ట్యూన్లు కట్టి సోలోగా ప్రైవేట్‌గానూ రిలీజ్ చేస్తుంటారు. రీసెంట్‌గా ఓ పాట‌ను సింగిల్ చేయ‌డం కోసం కంపోజ్ చేశారు. దాన్నే వీడియో చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. అందుకోసం త‌న టీమ్‌తో షూటింగ్ ప్లాన్ చేశారు. షూటింగ్ జ‌రుగుతుండ‌గా క్రేన్‌కి త‌గిలించిన దీపాలు స‌డ‌న్‌గా కింద‌ప‌డిపోయాయి. అవి అమీన్ నిలుచున్న ప్లేస్‌కి కుడివైపుగా ప‌డ్డాయి. దీని గురించి అమీన్ సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు.

``నాకు ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది. మేం సింగిల్ చేయాల‌నుకున్నాం. దాన్ని షూట్ చేయ‌డం కోసం మా టీమ్‌తో ఒక ప్ర‌దేశానికి వెళ్లాం. అక్క‌డ క్రేన్‌కి త‌గిలించిన వ‌స్తువులు ఒక్క‌సారిగా కుప్ప‌కూలి కింద‌ప‌డ్డాయి. నాకు కుడివైపుగా ప‌డ్డాయి. నేను కాస్త అటూ ఇటూ జ‌రిగినా నా మీద ప‌డేవి. లేకుంటే, గాలికి అది కాస్త ఇటు క‌దిలినా నా మీదే ప‌డేది. ఇవాళ న‌న్ను ప్రాణాల‌తో చూసేవారు కాదు. చాలా పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. దేవుడికి, నా త‌ల్లిదండ్రుల‌కు, గురువుల‌కు, శ్రేయోభిలాషుల‌కు, అభిమాన‌గ‌ణానికి అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగి మూడు రోజులైంది. అయినా ఇంకా మా టీమ్ షాక్ నుంచి తేరుకోలేదు. ఇప్ప‌టికీ మా క‌ళ్ల ముందు ప‌డ్డ వ‌స్తువులే క‌నిపిస్తున్నాయి. చాలా ఆందోళ‌న‌గా అనిపించింది. ఆ లైట్లు మీద ప‌డి ఉంటే జ‌రిగే న‌ష్టాన్ని ఊహించ‌లేక‌పోతున్నాం`` అని అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.